సీఎం జగన్ సభ వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి గాయాలు

  • జగన్ సభకు విచ్చేసిన 70 ఏళ్ల వృద్ధురాలు
  • బస్సు దిగి వెళ్తుండగా ఢీకొన్న బస్సు
  • ఆమె కాళ్లపై నుంచి వెళ్లిన బస్సు చక్రాలు
రాజమండ్రిలో సీఎం జగన్ సభ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన వైఎస్సార్ పింఛను కానుక సభకు విచ్చేసిన 70 ఏళ్లకు పైగా వయసున్న వృద్ధురాలు అర్జి పార్వతి బస్సు దిగుతూ జారిపడిపోయింది. సభాస్థలి వద్ద బస్సు దిగి వెళ్తుండగా బస్సు కదిలింది. బస్ ఆమెను ఢీకొనడంతో ఆమె కిందపడిపోయారు. ఆమె కాళ్లపై నుంచి బస్సు టైర్లు వెళ్లాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను కాకినాడలోని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Jagan
Sabha
Old Woman
Injured

More Telugu News